Monday, 27 July 2026 07:41:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీ సిటీ లో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక ఉత్సవాలు, వేడుకగా...

Date : 22 October 2023 09:35 AM Views : 218

సర్కార్ టీవీ న్యూస్ / తిరుపతి జిల్లా : శ్రీసిటీలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ వార్షిక ఉత్సవాలు శనివారం అత్యంత వేడుకగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, శ్రీమద్భాగవత పారాయణ ప్రతిధ్వనులతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. పరిశ్రమల ఉద్యోగులు, ట్రిపుల్ ఐటీ, క్రియా యూనివర్సిటీ విద్యార్థులతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం వేదపండితుల సంకల్పం, కలశపూజ, పుణ్యాహవచనం, వేదపారాయణం కార్యక్రమాలతో వార్షిక ఉత్సవాలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విష్ణు సహస్రనామ పఠనం, గణపతి హోమం, నవగ్రహ హోమం, సుదర్శన హోమం తదితర పూజలు నిర్వహించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి హోమం నిర్వహించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వార్షిక ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి ఆలయ ప్రాంగణంలో భాగవత సప్తాహం కొనసాగుతోంది. ఇందులో స్థానిక భాగవత భక్త సమాజం సభ్యులు భక్తి శ్రద్దలతో శ్లోకాలు పఠిస్తూ శ్రీమద్భాగవత పారాయణం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయ వార్షిక ఉత్సవాలు విజయవంతం కావడం పట్ల డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామస్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. స్వామివారి దర్శనం, వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులందరికీ తీర్థ, అన్నప్రసాదాలు అందచేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :