సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజక వర్గం లోని గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామంలో ఉన్నత పాఠశాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో నీటి పారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు తాగునీటి అవసరాలకై సాగర్ నీటిని విడుదల చేసి చెరువులను నింపుతామని తెలిపారు. హుజూర్ నగర్ మండలంలోని లింగగిరి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని మఠంపల్లి మండలంలోని కృష్ణ తండా గ్రామంలో గ్రామపంచాయతీ భవనాలను ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమాలలో మంత్రి మాట్లాడుతూ కృష్ణా జలాలను తాగునీటి అవసరాల కోసం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అందించుటకు కృషి చేసినది నేనేనని కృష్ణా నదిపై అమరవరం , పెదవీడు లిఫ్ట్ మొదలగు వాటిని నా హయాంలో నిర్మించి ప్రజలకు అందించడం జరిగినదని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయుటకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin