Sunday, 26 July 2026 09:54:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా కల్మల్ చెర్వు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం...

Date : 16 October 2024 08:35 AM Views : 599

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం కేంద్రంలోని కల్మలచెరువు గ్రామంలో 25 సంవత్సరాల తర్వాత కల్మల్ చెరువు జెడ్ పి హెచ్ ఎస్ వేదిక పై ఒక్కటి అయిన పూర్వ విద్యార్దినీ, విద్యార్థులు మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్న నాటి విద్యార్థులు, నేటి పౌరులు పదవ తరగతి పూర్తి అయి సరిగ్గా 24 సంవత్సారాలు నిండి, 25 వ వసంతం లోకి అడుగిడిన శుభ సందర్భంగా కల్మల్ చెరువు గ్రామం జెడ్ పి హెచ్ ఎస్ లో 1996-2000 సిక్స్త్ టు టెన్త్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.24 ఏండ్ల తరువాత పిల్లలు మళ్ళీ బడికి వచ్చిండ్రు, తమ బాల్యాన్ని తలుచుకున్నారు.గెట్ టు గెదర్ పార్టీని ఆనందంగా జరుపుకున్నారు.పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను, పాఠశాలతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాల్య స్మృతులు మళ్ళీ గుర్తుకు వచ్చాయని తెలిపారు. ముందుగా వందేమాతరం పాటతో ప్రారంభించి సరస్వతీ మాత కు పూజ చేసినారు ,ఆ తర్వాత చిన్ననాటి క్లాస్ మేట్స్ అందరూ ఒకరిని ఒకరు సుపరిచితం చేసుకున్నారు. అందరూ కలిసి, మెలిసి సంతోషంగా తమకు చదువు నేర్పిన గురువులను సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు.అందరూ గ్రూప్ ఫొటోలు దిగారు, తమతో పాటు చదివి భౌతికంగా తమ మధ్యలో లేని చనిపోయిన వారిని స్మరించుకుని నివాళులు అర్పించారు. అందరూ పది కాలాల పాటు పిల్లా పాపలతో,ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఉపాధ్యాయులు దీవించారు.ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు తెలుగు మాష్టారు డా"రావిరాల అంజయ్య,గణితం సార్ రంగారెడ్డి ,పూర్వ వాచ్ మేన్ నర్సోజి, పూర్వ విద్యార్థులు: దుర్గ, కల్పన, రాంబాబు, చంద్రయ్య, సంజీవ్, నాగశేఖర్, రవి , రాముడు, సైదులు, ఆర్ .శ్రీను, నరేష్ , శ్యాంసుందర్, నాగాచారి,సి హెచ్ .శ్రీను తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :