సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండల కేంద్రంలో మరియు సంగంబండ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు వేసవి సెలవుల్లో విరామకాల సద్వినియోగం కోసం పాఠశాల ఉపాధ్యాయురాలు పరమేశ్వరి విద్యార్థులకు జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ అధికారి విద్య సాగర్ ,కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అనిల్ గౌడ్ చేతుల మీదుగా సమ్మర్ వెకేషన్ వర్క్ బుక్స్ ను అందజేశారు. అనంతరం విద్యార్థులకు ప్రగతి నమోదు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ విద్య సాగర్ మాట్లాడుతూ ప్రగతి నమోదు పత్రాలు రంగుల్లో ఆకర్షణీయంగా ఉన్నందున హెడ్ మాస్టర్ వెంకటేష్ స్వంత ఖర్చులతో వర్క్ షీట్స్ పంపిణీ చేసినందున పరమేశ్వరి ను అభినందించారు. విద్యార్థులకు వేసవికాల తగు జాగ్రత్తలు గురించి సూచించారు. మక్తల్ పట్టణంలోని జిల్లా బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి ఆకాడమిక్ మోనిటరింగ్ అధికారి ( ఏ. ఎం. ఓ ) విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు ఇండోర్ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులకు సహాయంగా తమకు ఇష్టమైన కళ నేర్చుకోనుటకు ఈ సెలవుల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగంబండ ప్రాథమికోన్నత పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేష్, ఉపాధ్యాయులు వెంకట రాములు, రాజీ రెడ్డి, పరమేశ్వరి, షాహిన్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin