సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శబరి నగర్ లో గల శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో నేటి నుండి 45 రోజుల పాటు సాగే నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మిడి సోమ నరసయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాల ధారణ స్వాములకు 45 రోజులపాటు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు 41 రోజులపాటు దీక్షను కొనసాగిస్తున్న స్వాములకు కఠిన నియమాల్లో భిక్షకు అధిక ప్రాధాన్యత ఉందన్నారు దాతల సహకారంతో కొన్ని ఏళ్లుగా సాగుతున్న ఈ కార్యక్రమం వేల మంది భక్తులకు ఉపయోగపడుతుందని తెలిపారు మాలధారణ స్వాములకు అన్నదానం కార్యక్రమానికై తన వంతు సహాయంగా ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు అన్నదానం మహాదానం కనుక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నానని అన్నారు ప్రతి ఒక్కరు భక్తి భావన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మీల వాసుదేవ్, అయ్యప్ప దేవాలయ కమిటీ అధ్యక్షులు బెలిదే శ్రీనివాస్, కార్యదర్శి ఎలుగురి రాంబాబు, కోశాధికారి బచ్చు శ్రీనివాస్, పైడిమర్రి కేశవులు, నరేంద్రుని విద్యాసాగర్, మట్టపల్లి రాధాకృష్ణ, గొట్టిముక్కల శ్రీనివాస్ రెడ్డి , జె పి టి గురుస్వామి, మిర్యాల సంపత్ మనసాని రామ్మూర్తి, మనసాని నాగేశ్వర్ రావు, మీలా వంశి,రాచకొండ శ్రీను, మంచాల రంగయ్య, భాస్కరాచారి, బజ్జూరి శ్రీనివాసు,నర్సిరెడ్డి,రాజేష్,గజ్జి ఉపేందర్, దేవరశేట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin