సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మండలాల్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని తొగర్రాయి మందపల్లి మధిర అడవిరంగాపురం గ్రామాల్లో దళిత వాడల్లో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే మొదట గ్రామాలు అభివృద్ధి జరగాలని గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు దళిత వాడల్లో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం కొరకు 14 కోట్ల 50 లక్షలు నర్సంపేట నియోజకవర్గానికి మంజూరు చేయించడం జరిగిందని ఈ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో కూడా త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరి కిరణ్ రెడ్డి ఒలిగే నర్సింగరావు ఇంగోలి రాజేశ్వరరావు దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ కార్యదర్శి అమ్మ రోహిత్ ప్రచార కార్యదర్శి కురుతోట సురేష్ యూత్ బ్లాక్ అధ్యక్షుడు బొమ్మినేని భరత్ రెడ్డి యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యగం శివాజీ దుగ్గొండి మాజీ ప్రెసిడెంట్ ఎర్రల్ల బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాలలో గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter