సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన హుజుర్ నగర్ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి విచ్చేసి,రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన బోజడ్ల మురళీ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. వారి ఇంటికి వెళ్లి, వారి తల్లిదండ్రులను కలసి పరామర్శించారు. ఆ తరువాత అదే గ్రామానికి చెందిన కందుల చిన సత్యనారాయణ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేసుకొని, సీఎం ఆర్ ఎఫ్ ఎల్ ఓ సి ద్వారా చికిత్స పొంది, బెడ్ రెస్ట్ తీసుకుంటున్న వారి కుటుంబాన్ని కలిసి,పరామర్శించినారు. మరియు అనారోగ్యంతో బాధపడుతున్న తవిడిశెట్టి కాంతమ్మ కుటుంబాన్ని , పిక్కిలి అచ్చమ్మ కుటుంబాన్ని, మరియు కటిక బాబు కుటుంబాన్ని కలిసి, పరామర్శించిన మన హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.. ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin