సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు మరియు MLA మెచ్చా నాగేశ్వరరావు చేస్తున అభివృద్ధికి ఆకర్షితులై దమ్మపేట (మండలం), వడ్లగూడెం గ్రామానికి చెందిన సుమారు 40కుటుంబాలు అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో(తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో) BRS పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా పార్టీలో చేరిన మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అలాగే స్థానికంగా ఎమ్మెల్యే ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు నిర్మాణం చేశారనీ.ఇటీవలే అశ్వారావుపేట 100పడకల ఆసుపత్రిని,ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని అందులో భాగంగా నేడు 40మంది ఎమ్మెల్యే సమక్షంలో BRS పార్టీలో చేరామని రానున్న రోజుల్లో గడప గడపకు తిరుగుతూ ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడతాం అన్నారు.మళ్ళీ గెలిచేది వచ్చేది ఎమ్మెల్యే అని ధీమా వ్యక్తం చేశారు.(చేరిన వారిలో కాంగ్రెస్ మాజీ వార్డ్ మెంబర్ వలమాలిన నాగలక్ష్మి,పల్లె శ్రీను,పల్లె నాగు,వలమాల వెంకటేశ్వరరావు, అంబలై ,దొలయ్య,మల్లిక,స్వర్ణ,చందన తదితర మహిళలు ఉన్నారు).ఈ కార్యక్రమంలో తుతా సురేంద్ర రామకృష్ణ, రాజా తదితరులు ఉన్నారు....
-----------------------
Admin