Sunday, 26 July 2026 04:45:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజాక్షేత్రంలోకి

Date : 25 October 2023 02:46 AM Views : 218

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : ప్రచార రథాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్ ఆశీర్వదించండి కొత్తగూడెం అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా... స్వార్థపూరిత రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ప్రజలకు నేనున్నానంటూ నిస్వార్థమైన సేవలు అందించేందుకు ఇక నేను వస్తున్నానంటూ ఆజాద్ అధికార సేన రాష్ట్ర అధ్యక్షులు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంగళవారం పాల్వంచ మండలం జగన్నాధపురం లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో తన ఎన్నికల ప్రచార రథాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం సిద్ధించాలంటే దేవుని అనుగ్రహం కావాలని అందుకే తొలిసారిగా తన ప్రచార రథాన్ని స్థానిక పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రారంభించి ప్రజాక్షేత్రంలోకి ప్రచారానికి పంపుతున్నారని ప్రజలు తనపై నమ్మకం ఉంచి తన ప్రచార రథానికి అడుగడుగునా నీరాజనాలు పలకాలని ఆకాంక్షించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా హామీలను పక్కనపెట్టిన స్వార్థపూరిత నేతలను మనం చూసే ఉంటామని తాను స్థానికుడిని సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజాసేవకే తొలిసారిగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని మీ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపిస్తే కొత్తగూడాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపెడతానని స్పష్టం చేశారు. కార్య సాధన దిశలో కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికీ తన ముందున్న లక్ష్యాన్ని సాధించేందుకు వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. యువతకు ప్రధానంగా ప్రాధాన్యత కల్పించే గేయంగా నేను అడుగు ముందుకు వేస్తున్నానని తనతో పాటు నడిచే యువతకు స్వాగతిస్తున్నానని అన్నారు. బ్రష్టు పట్టిన రాజకీయాల్లో సరికొత్త మార్పులు తెచ్చుకుని తనకు సంపూర్ణంగా మద్దతు తెలిపి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు కృష్ణవేణి, గణేష్, వసుధ, వేణుగోపాల్, కమల్ జ్యోతి సీమకుర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: