Monday, 27 July 2026 05:02:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అట్టహాసంగా ప్రారంభమైన టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభలు...

Date : 20 June 2024 09:22 AM Views : 584

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : టియూటబ్ల్యూజె రాష్ట్ర తృతీయ మహాసభలు బుధవారం ఖమ్మంలోని ఉషాహరి కన్వెన్షన్‌లోని కామ్రేడ్ అమర్‌నాధ్ ప్రాంగణంలో అట్టాహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలను రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జర్నలిస్టు అమరవీరులకు, ఇటీవల మృతిచెందిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రతినిధులు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో టియూడబ్ల్యూజె గురించి రూపొందించిన పాటను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందేనన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాన్ని రూపొందిస్తోందన్నారు. మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరమైన ప్రమాణాలు పాటిస్తూ సమాజ చైతన్యానికి పని చేయాలన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆహ్వానం సంఘం అధ్యక్షులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలకు ఖమ్మం ఆతిధ్యమివ్వడం సంతోషకరమని, జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకుని ముందుకు పోవాలని కోరారు. ఇంకా మాజీ ఎంఎల్‌ఏ గుమ్మడి నర్సయ్య, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు, ఐజెయూ జాతీయ నాయకులు ఎస్‌ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్ తదితరులు మాట్లాడారు. పలు రాష్ట్రాల నుండి వచ్చిన సౌహార్ధ్ర ప్రతినిధులు ప్రసంగించారు. మహాసభలు ఉత్సాహబరితంగా సాగాయి. మధ్యాహ్నం ప్రతినిధుల సభ జరిగింది. సాయంత్రం పలు అంశాలపై తీర్మానాలు చేశారు. -నగరంలో జర్నలిస్టుల సందడి టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల సందర్భంగా 33 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. వీరితో పాటు ప్రారంభ సభకు జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో నగరంలో సందడి నెలకొంది. ఎక్కడా చూసినా ప్లెక్సీలు, బ్యానర్లు కనబడడంతో మహాసభల గురించి ప్రత్యేక చర్చ జరిగింది. -నేటి ముగింపు సభకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సిఎం నేడు జరుగనున్న టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల ముగింపు సభకు రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ ముగింపు సభలో ఆయన తో పాటు మీడియా అకాడమి ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఐజెయూ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: