సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ అర్ డి ఓ జగదీష్ రెడ్డి కి వారి కార్యాలయం నందు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టం లోనే మత సామరస్యా నికి ప్రతీకగా నిలిచిన జాన్ పహాడ్ దర్గా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఉండరు, అన్ని వేళల్లో భక్తులు నిత్యం దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు, దర్గా వద్ద కందూరుకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులను ముక్కు పిండి మరీ దర్గా కాంట్రాక్టర్లు దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారు.వక్స్ బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా, ధనార్జనే ధ్యేయంగా భక్తుల వసతులు గాలికొదిలేసి అందిన కాడికి దోచు కుంటున్నారు. ప్రతి ఏటా ఉర్సు ఉత్సవాలకు లక్షల్లో భక్తులు, కోట్లలో ఆదాయం వస్తున్నప్పటికీ కనీస వసతుల కల్పనలో వక్స్ బోర్డ్ అధికారులు విఫలమయ్యారు. దర్గా పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో భక్తులు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కావు. సైదన్న సన్నిధిలో మధ్యతరగతి కుటుంబాలు హడాలెత్తి పోతున్నారు అంతే కాకుండా దర్గా చుట్టూ పక్కలోనే విపరీతమైన మద్యం అందుబాటులో ఉంటున్నది వీటి మీద వెంటనే చర్యలు తీసుకొని అందరు మొక్కుకునే దర్గ ని కాపాడాలని ఉర్సు వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలి...
-----------------------
Admin