సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో మూడు రోజుల క్రితం సిఐ ఇంటి వద్ద టిడిపి శ్రేణులు ఆందోళన నిర్వహించి మీడియా ప్రతినిధుల సెల్ఫోన్లు లాక్కొని, పోలీసులు దౌర్జన్యం చేశారు. ఘటనను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారు. సీఐ మధు రిపోర్టర్లు నానా దుర్భాషలాడుతూ దాడి చేశారు. పోలీసులకు ఉసిగొలిపారు. ఎన్టీవీ రిపోర్టర్ షబ్బీర్ సెల్ ఫోన్ లాక్కున్నారు. ఘటనలో డిపోర్టర్ల పై కదిరి సీఐ తమ్మిశెట్టి మధు రివర్స్ కేసులు పెట్టారు స్థానిక రిపోర్టర్లు షబ్బీర్, సోమశేఖర్, రాము, బాబాన్ కేసులపై పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. ఈ విషయంపై కదిరికి వచ్చిన శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ కి రాతపూర్వకమైన ఫిర్యాదు అందిస్తూ జరిగిన ఘటనపై స్థానిక రిపోర్టర్లు వివరించడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన ఘటనకు కారణమైన కదిరి సీఐ మధు పై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవర్ చేయడానికి వెళ్లి రిపోర్టర్ల పై అక్రమ కేసులు బనాయించడానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కదిరి ఘటనలో రిపోర్టర్ల పై బనయించిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము. రిపోర్టర్ల పై దాడులకు పాల్పడిన పోలీసుల పైన... అందుకు కారణమైన సీఐ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా కనగానపల్లి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఆంజనేయులు పైన అక్రమంగా ఇవాళ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిర్ధారించిన స్థాయిలో విచారణ జరిపి పూర్తి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. కదిరిలో రిపోర్టర్ల పై అక్రమ కేసులు బనాయించిన అంశo పైన ఓబుల దేవర చెరువు తహసీల్దార్ శ్రీధర్ కి వినతి పత్రం అందజేసిన ఓ డి సి ప్రెస్ రిపోర్టర్ చంద్ర శేఖర్ రెడ్డి (సాక్షి) షాజహాన్ (ఆంధ్రజ్యోతి), ఫిరోజ్ (హెచ్ఎం టీవీ) మౌలాలి (మహా న్యూస్) మహబూబ్ బాషా (సర్కార్ టీవీ) రమణప్ప (ధర్మపోరు), ఫయాజ్ భాష (ప్రజాశక్తి) ఆనంద్ ( అనంత జనశక్తి ) శంకర్ (అనంత న్యూస్) గోపీనాథ్ రెడ్డి (మనం ) ఆంజనేయులు ( ఫోకస్ అనంత) తదితరులు
-----------------------
Admin