సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 15,16,17 తేదీలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని బిజెపి సీనియర్ నాయకులు, పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి మీడియా సమావేశం లో తెలిపారు. శ్రేయాన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్, పీవీఆర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందుకు సంబందించిన బ్రోచర్ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా ఎస్ ఎస్ సి, ఇంటర్, డిప్లమా, ఐటీఐ, బిటెక్, ఏంబిఏ, ఎంసిఏ, బి ఫార్మాసీ, ఎం ఫార్మసీ, పీజీ ప్రేషర్స్, ఎక్స్పీరియన్స్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సుమారు 100 కంపెనీలకు చెందిన 5000 వేళ ఉద్యోగాలు కల్పిస్తూన్నామని నిరుద్యోగులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
-----------------------
Admin