సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మల్లం పల్లి మండలం ప్రకటిస్తూ జి.వో విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర పంచాయితి రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క, ఎన్నికల సమయంలో టిపిసిసి అధ్యక్షుడి హోదాలో పాదయాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మల్లం పల్లి ప్రజల ఆకాంక్షను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే మల్లం పెల్లి రెవెన్యూ మండలం గా సంపూర్ణమైన జీవో విడుదల చెయ్యడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఓట్ల కోసం మండలం చేస్తా అని ఓట్ల అయిపోయినక మర్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు అని నిరూపించడానికి ఇదే నిదర్శనం అని ఈ జీవో ములుగు నియోజక వర్గం లోని గ్రామాలతో నూతన రెవెన్యూ మండలం గా ఏర్పాటు చేయబోతున్నాం అని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి సహకరించిన ఇంచార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నూతన మల్లం పెల్లి మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు...
-----------------------
Admin