సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ పట్టణo పరిధిలోని జగనన్న హౌసింగ్ లేఔట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, వేగవంతంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెనుకొండ పట్టణ పరిధిలోని జగనన్న హౌసింగ్ లేఔట్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం ఊపందుకోవాలన్నారు. పెనుకొండ పరిధిలో జగనన్న హౌసింగ్ లేఔట్లలో 1,915 ఇళ్లు మంజూరుకాగా, బిలో బేస్మెంట్ స్థాయిలో 296 ఇళ్లు, బేస్మెంట్ స్థాయిలో 658, ఆర్ఎల్ స్థాయిలో 220, ఆర్సీ స్థాయిలో 334 ఇళ్లు నిర్మాణంలో ఉండగా, మరో 400 ఇళ్లు నిర్మాణం పూర్తి కావడం జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్నవాటిని బేస్మెంట్ స్థాయికి, బేస్మెంట్ స్థాయిలో ఉన్నవాటిని ఆర్ఎల్ స్థాయికి, ఆర్ఎల్ స్థాయిలో ఉన్న ఇళ్లను ఆర్సీ స్థాయికి తీసుకురావాలని, ఆర్సీ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్లు నిర్మాణంల్లో ఎలాంటి అలసత్వం ఉండరాదని, అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ చంద్రశేఖర్, డిఈ శంకర్ లాల్, ఏఈ శ్రీనాథ్, ఎంపిడిఓ శివ శంకరప్ప, తహసీల్దార్ స్వర్ణలత, మున్సిపల్ కమిషనర్ వంశీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin