సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శాసనసభ ఎన్నికలు 2023 సంవత్సరం కు సంబంధించి త్వరలో జరగనున్న ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ అంతర్రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారులతో మఠంపల్లి మండలం ఎన్సిఎల్ ఫ్యాక్టరీ కాన్ఫిరెన్స్ హల్ నందు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం నందు ఉమ్మడి జిల్లా కు చెందిన కోదాడ డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ టి ఆర్ జిల్లా, పలనాడు జిల్లాలకు చెందిన నందిగామ డిఎస్పి జనార్ధన నాయుడు, సత్తనపల్లి డిఎస్పీ ఆధినారాయణ, గురజాల డిఎస్పీ అప్పలరాజు, సంభందిత సర్కిల్ ఇన్స్పెక్టర్ లు మొత్తం 30 మంది అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి పరిరక్షణ ధ్యేయంగా బార్డర్ పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలియజేసిన జిల్లా ఎస్పీ ఈ సమావేశం నందు అంతరాష్ట్ర, అంతర్ జిల్లా పోలీస్ చెక్ పోస్ట్ ల ఏర్పాటు వాటి నిర్వహణ, తనిఖీలు, కేసుల నమోదు గురించి, గంజాయి, మాదక ద్రవ్యాలు కట్టడి, అక్రమంగా మద్యం సరఫరా కట్టడి, నాటుసారా తయారీ ముడి సరుకు నల్లబెల్లం, పట్టిక రవాణా కట్టడి, నకిలీ విత్తనాల నిరోధం, దొంగతనాలు నిరోధం, పాత దొంగలు, నేరస్తుల సంచారం కట్టడి, ఇంటలిజెన్స్ సమాచారం పంచుకోవడం, ఎన్నికల నియమావళి అమలులో ముఖ్యమైన విషయాలు మొదలగు అంశాలపై ఈ సమావేశం నందు చర్చించి ఎజెండా అమలుకు కావలసిన ప్రణాళికను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అసాంఘిక చర్యలు అసాంఘిక కార్యకలాపాలు అక్రమ రవాణాను, ప్రలోబాలను నిరోధిస్తూ ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేయడం కోసం స్వేచ్ఛను కల్పించడానికి, రక్షణ కల్పించడం కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని సూచించారు. అనుకూల, ప్రతికూల పరిస్థితులను అన్నింటినీ అధిగమించడం కోసం అత్యంత అప్రమత్తంగా, ప్రణాళిక ప్రకారం పని చేయాలని సూచించారు. దీనికోసం సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఉంచడం, సరిహద్దు అధికారులు ఒకరికొకరు పరస్పరం సమచారాన్ని చేరవేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపినారు. ఈ సమావేశం నందు ఇరు రాష్ట్రాల సరిహద్దు అధికారులు, సి ఐ లు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ సి ఐ శ్రీనివాస్, డి సి అర్ బి సి నర్సింహ, సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin