సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: ఇల్లు లేని పేదల కోసం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మీ పథకం దరఖాస్తులకు గడువును పొడగించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలోని ప్యూన్ బస్తీ 5వ వార్డులో ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహలక్ష్మీ పథకం దరఖాస్తులకు ప్రభుత్వం మూడే రోజులు గడువు ఇచ్చిందని ఇది సరైంది కాదని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వ తీరు పేదలను ఊరిస్తూ ఉసురుమనిపిస్తుందని,అందుకు తాజాగా గృహలక్ష్మీ దరఖాస్తుల గడువే నిదర్శనమని సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి రూ.3 లక్షలు అందిస్తామని ప్రకటించి కొన్ని యేళ్ళుగా ఊరిస్తూ వచ్చి,లక్షల మంది పేదలతో ముడిపడి ఉన్న ఈ పథకానికి మూడే రోజులు ఇవ్వడమే కాకుండా దరఖాస్తుకు ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాలనే నిబంధన విధించడంతో వీటిని మీ-సేవ ద్వారా పొందాలంటే కనీసం వారం రోజులైనా పడుతుందన్నారు.రాష్ట్రంలో తహశీల్దార్లు కూడా బదిలీలు అయ్యారని,కొంతమంది బదిలీ అయిన ప్రాంతానికి ఇంకా వెళ్ళలేదని కావున దరఖాస్తుల గడువు పెంచాలని కోరారు.లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలంటే లాటరీ పద్దతిలో ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,గుడివాడ రాజేందర్,వంగా రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin