సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రాష్ట్రంలో నిరుద్యోగుల దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 2 కు దరఖాస్తు చేయడానికి మరి కొన్ని రోజులు గడువును ఇవ్వాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా కోరారు. అనంతరం ఫహీమ్ దాదా మాట్లాడుతూ ఇప్పటికే అనేకమంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని కానీ కొంతమంది నిరుద్యోగులు కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఇప్పటికీ దరఖాస్తు చేయలేకపోయారు కాబట్టి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఏదైతే చివరి తేదీ నిన్నటి రోజుల్లో అయిపోయిందో దానిని తిరిగి కొన్ని రోజులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో కూడా ఇచ్చిన చివరి దరఖాస్తుకు సమయం నందు అనేక సాంకేతిక సమస్యలతో నిరుద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి 17/ 01/2023 నాటికి కూడా దరఖాస్తు చేయడానికి నిరుద్యోగులు ప్రయత్నించిన సాంకేతిక లోపాల వల్ల కనీసం దరఖాస్తు చేయడానికి అవకాశం లేకపోవడంతో అనేకమందిని నిరుద్యోగులు అసౌకర్యానికి గురి కావడం జరిగింది నిరుద్యోగదృష్ట గ్రూప్ 2 దరఖాస్తు చేయడానికి మరి కొన్ని రోజులు గడువు పొడిగించవలసిందిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి పక్షాన విజ్ఞప్తి చేశారు.
-----------------------
Admin