సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఖమ్మంలో జరిగే బిజెపి అమిత్ షా మీటింగ్ కు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను పంపడం సిగ్గుచేటని టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకే తాను గుడ్డలని ఆరోపించారు. వీరిద్దరు అందరి ముందు కుస్తీ తెరవెనుక దోస్తీ అన్నట్టు నటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నాని నాగా సీతారాములు ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనగర్జన సభకు బస్సులు కావాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరితే ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా సభను అడ్డుకోవాలని చూసిన బిఆర్ఎస్ ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పువ్వాడ నేడు బీజేపీ పార్టీ చేపట్టిన సభకు అమిత్ షా వస్తుంటే జీహుజూర్ అంటూ బస్సులు ఇవ్వడం పద్దతేనా అంటూ ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీ కి బిజెపి బీ టీం అన్న ఆయన కేవలం కల్వకుంట్ల కవిత అరెస్ట్ ను ఆపేందుకే కేసీఆర్ బీజేపీ ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తూము చౌదరి, తాండ్ర నాగబాబు, కనకరాజు ,మారెడ్ల నరసింహారెడ్డి, దుర్గారాశి సతీష్, వనమా రాము, చిమట నాగేశ్వరావు, వెంకటేష్, మహేష్, కల్లూరి సంపత్, వాంకుడోత్ రవి, రాము, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin