Monday, 27 July 2026 05:36:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గృహాలక్ష్మి పథకానికి వచ్చిన ప్రతి ధరఖాస్తును క్షేత్రస్థాయిలో విచారణ చేయాలి...

Date : 01 September 2023 05:32 AM Views : 349

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గృహాలక్ష్మి పథకానికి వచ్చిన ప్రతి ధరఖాస్తును క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం గృహాలక్ష్మి పథక ధరఖాస్తులు విచారణ ప్రక్రియపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, యంపిడిఓలు, యంపిఓలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా 86,773 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. పథకానికి వచ్చిన దరఖాస్తులు మండలవారిగా అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని, అట్టి జాబితాననుసరించి నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. పథకం వర్తింపచేయాలని వచ్చిన ఏ ఒక్క దరఖాస్తును విడిచిపెట్టకుండా ప్రతి దరఖాస్తును విచారణ చేయాలని ఆదేశించారు. పథకం అమలుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విచారణ టీములు దరఖాస్తు దారుల ఇళ్లకే వస్తున్నందున దరఖాస్తు చేసిన లబ్దిదారులు ఇంటికి సంబంధించిన ఏదేని ఆధారాలు సిద్ధంగా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. లబ్దిదారులు విచారణకు వచ్చిన టీములకు సహకరించాలని చెప్పారు. తనిఖీలో అర్హుల, అనర్హుల జాబితా రూపొందించాలని, విచారణ నివేదికలు సంబంధిత మండల తహసిల్దార్, యంపిడిఓ, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు ధృవీకరణతో అందచేయాలని పేర్కొన్నారు. ఈ టెలి కాన్ఫరెన్సులో ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: