సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : శ్రీదేవి శరన్న నవరాత్రులు పురస్కరించుకొని అమ్మ దీవెనలు ప్రతి ఒక్కరు పై ఉండాలని కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆజాద్ అధికారి సేన రాష్ట్ర అధ్యక్షులు కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్ ఆకాంక్షించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ కాలనీలో నిర్వహించిన శ్రీదేవి శరన్న నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. దసరా పండుగను పురస్కరించుకొని తొమ్మిది రోజులపాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను భక్తులు అత్యంత శ్రద్ధలతో నిర్వహిస్తారని ఈ ఉత్సవాలు ఐక్యతకు ఆనవాళ్లుగా నిలుస్తాయి అన్నారు. కుల మతాలకతీతంగా నీవు వచ్చేవాళ్ళు అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
-----------------------
Admin