సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ :- గుండెపోటుతో అకాల మృతి చెందిన భువనగిరి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్ చిత్రపటానికి హుజూర్నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం శ్రద్ధాంజలి ఘటించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలోపించి నివాళులు తెలిపారు. అనంతరం మరోసారి న్యాయవాదులు మాట్లాడుతూ ఇస్మాయిల్ సేవలు వెలకట్టలేనివి అన్నారు. ఆయన మృతి బాధాకరం అన్నారు. అఖిల భారత న్యాయవాదుల యూనియన్ లో అనేక పదవులు నిర్వహించి న్యాయవాదుల అభ్యున్నతి కోసం పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చనగాని యాదగిరి న్యాయవాదులు పిన్నపనేని వెంకటరెడ్డి, వట్టికూటి అంజయ్య, రమణారెడ్డి, కమతం నాగార్జున,రామలక్ష్మారెడ్డి, శ్రీను నాయక్, సైదా హుస్సేన్ పాల్గొన్నారు
-----------------------
Admin