సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : డ్రైనేజీ లో అనుమానాస్పదంగా పడి ఉన్న మృతదేహం మండలంలో కలకలం రేపింది.వివరాలలోకి వెళితే సోమవారం రాత్రి బొత్తల పాలెం గ్రామానికి చెందిన ఎడ్ల పాండు(55 ) విగత జీవిగా డ్రైనేజీలోపడిఉండగా మంగళవారం తెల్లారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పాలకీడు మండల ఎస్సై లింగయ్య ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.విషయం తెలుసుకున్న హుజూర్ నగర్ సిఐ రామలింగారెడ్డి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కన సిసి రోడ్డుపై పడి ఉన్న రక్తపు మరకలను గుర్తించారు. పోలీసులు రక్తం నమూనాలను సేకరించారు. మృతుని భార్య చాలా కాలం క్రితం చనిపోయింది. పాండు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఒక కూతురు, కొడుకు, కూతురు నేరేడుచర్లలో ఉంటుంది ప్రస్తుతం ఆమె మాత్రమే వచ్చి పోలీసుల సహకారంతో హుజూర్ నగర్ పోస్టుమార్టంకి తండ్రి మృతదేహంతో వెళ్ళింది. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి జవాన్ ని ఎస్సై పంపారు. మృతుని కుమారుడు అందుబాటులో లేడు. పాండు మృతి పై గ్రామస్తులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు చనిపోతే మృతదేహం డ్రైనేజీ లోపలికి ఎలా వెళ్తుందని చర్చించుకున్నారు.సిసి రోడ్డుపై రక్తపు మరకలు ఉండడం, మృతదేహం డ్రైనేజీ లోపలికి నెట్టి ఉండటంపై గ్రామస్తులకు అనుమానాలు ఉన్నాయి.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
-----------------------
Admin