సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామం నందు గల అంతర్ రాష్ట్ర (తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్) సరిహద్దు చెక్పోస్ట్ తనిఖీ చేసి అనంతరం నాగార్జున సిమెంట్ సింహపురి నందు విలేకరుల సమావేశం లో ఇంటర్ స్టేట్ ఇంటెలిజెన్స్ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సమావేశంలోని ముఖ్య అంశాలు... నోటిఫికేషన్ వెలువడి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ అమలులో ఉంటుంది జిల్లాలో ఇప్పటివరకు 7 కోట్ల 50 లక్షల నగదు, మద్యం, ఆర్నమెంట్ ల ను సీజ్ చేయడం జరిగింది. 5 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టుల వద్ద పటిష్ట భద్రత చెక్పోస్ట్ వద్ద నిఘా నేత్రాలు రెండు రాష్ట్రాల బోర్డర్స్ లో ఎలాంటి పడవలు నడపకుండా చూడటం రెండు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టుగా చూడడం . బ్యాంకు ట్రాన్సాక్షన్స్ మానిటరింగ్ సెల్ ద్వారా బ్యాంకు ఖాతాలోని ఎక్కువ నగదును జమ చేయడం, ఎక్కువ నగదును డ్రా చేయడం, వివిధ అకౌంట్స్ కు నగదును ట్రాన్స్ఫర్ చేయడం వంటి ఖాతా యొక్క పూర్తి వివరాలు ప్రతిరోజు జిల్లా ఇంటిలిజెంట్ కమిటీకి అందజేయడం. పీడియాక్ట్ గల వ్యక్తులు ,గత ఎన్నికలలో గొడవలలో పాల్గొన్నటువంటి వ్యక్తులు గుర్తించి వివరాలు సేకరించడం ,రౌడీ షీటర్స్ ను బయండోవర్ చేయడం. రెండు రాష్ట్రాల రెవెన్యూ ,పోలీస్ ఎక్సైజ్ , కమర్షియల్ టాక్స్, ఇన్కమ్ టాక్స్ ,ట్రాన్స్పోర్ట్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు నిఘాపేంచటం పూర్తి సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారికి అందజేయడం. పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు పూర్తి సహకారాన్ని అందిస్తామని జిల్లా సరిహద్దులలో గట్టి నిఘ ఏర్పాటు చేసి పూర్తి వివరాలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావ్ కి తెలియజేయడం జరుగుతుందని పోలీస్ ఎక్సైజ్ ఫారెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్కమ్ టాక్స్ కమర్షియల్ టాక్స్ అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి ఎన్నికలకు పూర్తి సహకారం అందిస్తామని పల్నాడు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే బికే పల్నాడు ఎస్పి రవిశంకర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పల్నాడు ఆర్డీవో రమాకాంత్ రెడ్డి డీఎఫ్ఓ సతీష్ కుమార్ ఎక్సైజ్ అధికారి అనిత హుజూర్ నగర్ ఆర్డీవో జగన్మోహన్ రెడ్డి మఠంపల్లి తాసిల్దార్ మంగ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఇన్కమ్ టాక్స్ అధికారులు పాల్గొన్నారు
-----------------------
Admin