సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన చెప్యాల అజిత్ అనే యువకుడు గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో శుక్రవారం రోజున ఉరివేసుకుని బలవన్మరణం చెందినట్లు వెల్లడించారు. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి మండలం ధర్మారంలో చోటుచేసుకుంది. తండ్రి రాజయ్య మందలించాడంతో మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అజిత్ ఆత్మహత్యతో ధర్మారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు...
-----------------------
Admin