సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఎస్ ఎస్ యు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్పేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ స్వేరో సంక్షేమ హాస్టల్లో పరిరక్షణకై విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ ఎస్ యు విద్యార్థి బైక్ యాత్రను గత ఐదు రోజుల నుంచి కొనసాగిస్తూ వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ ను ఐదు రోజులపాటు తిరుగుతూ విద్యార్థులను కలుస్తూ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. సంక్షేమ హాస్టళ్లకు డైట్ చార్జీలను పెంచిన విధంగా అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనము అందించాలని మరియు అదే విధంగా సొంత భవనం కూడా నిర్మించాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఎస్ ఎస్ యు హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం ప్రభుత్వ మరియు ప్రైవేట్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి యాజమాన్యాల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత ఐదు రోజుల నుంచి విద్యార్థులు మా దృష్టికి తీసుకువచ్చిన అనేకమైన సమస్యలను ఉన్నత అధికారులను కలిసి పరిష్కారమూ ఆయ్యేంతవరకు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు బొచ్చు రాజు చెట్టుపల్లి శివకుమార్ మరియు శ్రావణ్ ముగింపు సభకు హాజరు కావడం జరిగింది.
-----------------------
Reporter