సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడం : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం బస్టాండ్ వద్ద గల చైల్డ్రెన్స్ పార్కు ఎదుగుగా 5వ రోజు కొనసాగిస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని,వారికి ఈపీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు.అదేవిధంగా ప్రతీ ఆదివారం సెలవు ప్రకటించడంతో పాటు పండుగలకు సెలవు ఇవ్వాలని,11వ పీఆర్సీ ప్రకారం ప్రతీ కార్మికులకు 25 వేల రూపాయలు ఇవ్వాలని,మల్టీపర్పస్ పని విధానాన్ని రద్దు చేయాలని, అర్హత కలిగిన కారోబార్లు,బిల్లు కలెక్టర్ లకు పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించాలని.చనిపోయిన కార్మికుల దాహన సంస్కారాల కోసం 30 వేల రూపాయలు ఇవ్వాలని,జీఓ 51ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని,వారు చేస్తున్న నిరవధిక సమ్మెకు పూర్తిగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,తంబర్ల నరసింహరావు,జెర్పుల కళ్యాణ్,గూగులోత్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin