సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీ తో గెలవాలని పాలక వీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జాన్ పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దర్గా, మహంకాళిగూడెం లలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ ఆరు హామీలు, మ్యానిఫెస్టోను ప్రజలకువివరించారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ఎన్.వి సుబ్బారావు, ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్ లు మాట్లాడుతూహుజూర్నగర్ నియోజకవర్గం ముఖచిత్రాన్ని మార్చేసిన అభివృద్ధి ప్రదాత,అభివృద్ధికి ఆధ్యుడైన ఉత్తమ్ ను ప్రజలందరూ దీవించి భారీ మెజార్టీతో గెలిపించాలని.6 గ్యారంటీల పథకాన్ని ప్రతి ఓటర్ కి చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పింఛన్లు 4వేలకు పెంపు, ఖాళీ ఉద్యోగాల భర్తీ 5 వందలకే గ్యాస్ సిలిండర్ ,మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఒకే సారి 2లక్షల రూపాయల రుణ మాఫీ,ఇంటి నిర్మాణానికి 5 లక్షలు,ఇలా ఆరు గ్యారెంటీల స్కీం లను ముమ్మరంగా ప్రచారం చేస్తూ,రాబోయే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాలోత మోతిలాల్ నాయక్, జిల్లా నాయకులు బైరెడ్డి జితేందర్ రెడ్డి,ఎంపిటిసిల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్,ఎంపిటిసిలు రామవత్ నీమా నాయక్, బానో త్ వెంకటి,నాయకులు బెల్లంకొండ నరసింహరావు,షేక్ సైనావలి, జ్యోతి,బుడిగే సైదులు,వెచ్చసందీప్, మధు నాయక్,శ్రీకాంత్,శేషు,సుబ్బుగౌడ్,కిషన్,దావీదు,సైదరావు,వేణు,నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin