సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలుగుదేశం పార్టీ నలగొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసవి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆదేశం మేరకు హుజూర్ నగర్ లోని ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మాట్లాడారు. 22 లక్షల పైగా ఇండ్లు లేని బాధితులు ఉంటే కొన్ని కూడా నిర్మాణం చేయకుండా పేద ప్రజలను మోసం చేశారని , ఇండ్ల స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఇస్తానన్న హామీని కూడా విస్మరించారని అన్నారు. గృహలక్ష్మి పథకం కూడా ప్రజలను మధ్య పెట్టే పథకమేనని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడం విడ్డూరమన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని , పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, గిరిజనులకు, మైనారిటీలకు ఇస్తానన్న 12% రిజర్వేషన్లను ఇవ్వాలని ,ఎస్సీ ,ఎస్టీలకు ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీ నిధులను ఇచ్చి ఆయా వర్గాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డిఓ కార్యాలయంలోని డిఓ నారాయణ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కొమ్మ గాని వెంకటేశ్వర్లు గౌడ్ , మీసాల సైదులు, మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షులు మాలోతు నాగు నాయక్, గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కీసరి నాగయ్య ముదిరాజ్ , గుండు వెంకటేశ్వర్లు గౌడ్ మేళ్లచెరువు మండల పార్టీ అధ్యక్షులు చిన్నపంగు నాగరాజు , హుజూర్ నగర్ మండల పార్టీ అధ్యక్ష ప్రధాన ,కార్యదర్శులు కస్తాల కనకరత్నం, తురక గోపి చింతలపాలెం మండల పార్టీ అధ్యక్షులు మేకల రామారావు యాదవ్, మాజీ ఎంపీపీ ఆళ్ల భాగ్యమ్మ చౌదరి, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భూక్య బాలాజీ నాయక్ , కళ్ళు గీత కార్మిక సంఘం జిల్లా నాయకులు చీకూరి గోవిందరావు , పార్టీ సీనియర్ నాయకులు తమ్మిశెట్టి రాములు, హుజూర్ పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు చంద్రగిరి సాంబ ,తెలుగు యువత నాయకులు, అంజయ్య , రాంబాబు , లింగయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin