సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పోలీసు డివిజన్ లో ఇటీవలే నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులను కృష్ణ మహేష్ ప్రజా సేన ఆల్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.డి. ఖాదర్ గోరి మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్టు మీడియాకు తెలిపారు. షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసిపి) రంగస్వామి అదేవిధంగా షాద్ నగర్ పట్టణ సిఐ ప్రతాప్ లింగం అలాగే కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ను వేరువేరుగా కలిసి శాలువాలతో సన్మానించారు. డివిజన్ లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలంటూ ఆయన పేర్కొన్నారు. సమర్థవంతమైన అధికారులతో శాంతిభద్రతలు పరిఢవిల్లుతాయని ఖాదర్ గోరి అభిప్రాయపడ్డారు.
-----------------------
Admin