సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో మన ఊరు, మన బడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం జరుపుకున్న విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో సాధించిన పురోగతి మీద మక్తల్ నియోజకవర్గం, మక్తల్ మండలంలోని కర్ని ప్రాథమిక పాఠశాలలో జరిగిన విద్యా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పాఠశాల ప్రహరీగోడ, అదనపు తరగతుల గదులను రుబ్బేన కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... మన ఊరు మారింది, మన బడి కూడా మారాలనే ఉద్దేశ్యంతో విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం ఇస్తున్న క్రమంలో ఉదయం రాగి జావా ప్రారంభిస్తున్నట్లు వివరించారు. మన ఊరు, మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని విద్య నాణ్యత పెంపుదల సౌకర్యాల పట్ల లక్ష్యంగా కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ మంగులాల్, పంచాయతీ రాజ్ ఏఈ లక్ష్మీ నారాయణ, ఎంపీడీఓ శ్రీధర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీలత , రఘువీర్ నామాజీ, మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ గాసం చిన్న రంగప్ప, పాఠశాల SMC చైర్మన్ గాసం ఆంజనేయులు, మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్, మాజీ ఎంపీటీసీ రాధా దత్తురాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin