సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని భీమ్లా తండా గ్రామపంచాయతీలో సిపిఐ(యం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మండల స్థాయి మహాసభను ఘనంగా నిర్వహించారు.ఈ మహాసభకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జండా ఎగరవేసి మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మాత్రం అమలు చేశారు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఇంకా 40 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఎకరాకు 15000 రైతుబంధు సాయం అందిస్తాం అన్నారు ఖరీప్ సీజన్ అయిపోయిన నేటికీ అమలు చేయలేదు ఉచిత గ్యాస్ 200 యూనిట్ల కరెంటు పింఛన్లు మహిళలకు నిరుద్యోగ యువతకు భృతి వంటి అనేక హామీలు పెండింగ్ లోనే ఉన్నాయి హైదరాబాదులో చెరువులను ఆక్రమించి కట్టిన ఇండ్లను ప్రైవేటు ప్రకారాలను హైడ్రా పేరుతో కూల్చుతున్నారు మూసి పక్షాళన చేస్తామని పనులు చేపట్టారు ప్రతిపక్షంగా మనం మూసి పరివాహక ప్రాంతంలో చెరువుల పక్కన ఉన్న పేదలకు ముందు అనే పూర్తి పునరావ్యాసం ఏర్పాటు చేసి వారి నుండి అనుమతి పొందినా తరువాతే ముందుకు పోవాలని ప్రభుత్వానికి తెలిపారు మఠంపల్లి మండలంలోని 29 గ్రామపంచాయతీలు మొత్తం జనాభా 44939 మంది ఉన్నారు అందులో పురుషులు 22,579 స్త్రీలు 22,360 మంది ఉన్నారు మండలంలో మూడు సిమెంట్ పరిశ్రమలు కలిగి ఉన్న ఇందులో స్థానికులు కేవలం రోజు వారి కూలిలుగానే పనిచేస్తున్నారు కొందరు మాత్రం ఏళ్ల తరబడి కాంట్రాక్టు కింద పని చేస్తూ పర్మినెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు మరియు వ్యవసాయ కూలీలు ఇటీవల ఉపాధి హామీ పనులు చేస్తూ జీవిస్తున్నారు వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగటంతో పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రాంతంలో 99% సన్న చిన్న కారు రైతులు మాత్రమే ఉన్నారు ముఖ్యంగా పెదవీడు 540 సర్వే నెంబర్ లోని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మండలంలోని 29 గ్రామపంచాయతీలలో 32 తండాలలో 30వేలకు పైగా గిరిజనులు ఉన్నారు మండలం మొత్తానికి ఒకే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది డాక్టర్ ఒకరే ఉన్నారు రోగులంతా గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆర్ఎంపి పిఎంపీలని ఆశ్రయిస్తున్నారు కావున ఇద్దరు డాక్టర్లు ఉండాలని అన్నారు మరియు భూక్య పాండు నాయక్ మాట్లాడుతూ గుర్రంపోడు తండా బొజ్జ తండా రామచంద్రపురం తండా 540 సర్వేలో బడా వ్యాపారవేత రవీందర్ రెడ్డి కొంతమంది రౌడీలను పెట్టి రైతుల మీద దాడి చేయించి కాళ్ళు చేతులు ఇరగొట్టి మళ్లీ ఇదే రైతులు మీద కేసు పెట్టి 40 మంది రైతులు జైలు పాలు అవ్వడం జరిగింది దీంతో విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో మాట్లాడి 300 మంది రైతులతో కలిసి రంగారెడ్డి పాదయాత్ర నిర్వహించి ల్యాండ్ మీద వచ్చి రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది దీంతో ఈరోజు రైతులు ఎవరి పొలాలు వాళ్ళు చేసుకుంటున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(యం)జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్ మండల కార్యదర్శి మాలోతు బాలు నాయక్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ జగన్ మోహన్ రెడ్డి సయ్యద్ రన్మియా జాల తిరుపతయ్య పొడి శెట్టి రాము చెంబయ్య కే వెంకట్ రెడ్డి ఎం రాజు ఎన్ లక్ష్మమ్మ డి హరియా నాయక్ భూక్య కేష్య నాయక్ భూక్య చింగ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin