సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ధరావత్ ప్రీతి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించడమైనది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ ధరావత్ ప్రీతిది ఆత్మహత్య కాదని ఇది హత్య అని ప్రీతి తండ్రి ఒకవైపు చెప్తూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి ఆమెది ఆత్మహత్య అనే విధాం గా వ్యవహరించడం సరైనది కాదని. అసలు కారణం తెలుసుకోవడానికై వెంటనే సెట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ చేయించాలని. ఆమె మరణానికి కారణమైన డాక్టర్ సైఫ్ ను ఉరి తీసిన తప్పులేదని. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా, కంటి తుడుపు చర్యగా కుటుంబానికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం ఆమె కుటుంబానికి ఏపాటి న్యాయం చేస్తున్నట్లు? ఆమె లేని లోటు ఆ కుటుంబానికి ఏ విధంగా తీర్చినట్లని బిజెపి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాఉంది. ఇలాంటి కంటి తుడుపు చర్యలవల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వనికి హిందువులపై ఉన్నటువంటి గౌరవం ఏపాటిదో స్పష్టమవుతాఉందని. వెంటనే ప్రీతి కుటుంబానికి 10 కోట్లు మరియు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడమైనది. అదేవిధంగా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు, కఠినమైన చట్టాలు తీసుకురావాలని. లేనట్లయితేరాబోయే కాలంలో ఈ మహిళల, యువతుల, బాధితుల ఉసురుతలిగి బీ.ఆర్.ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో కనుమరుగైపోవడం ఖాయమని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడమైనది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి మరియు వివిధ మూసాల నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొనడంమైనది....
-----------------------
Admin