సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం క్లభ్ లోబాలోత్సవ్ చిల్డ్రన్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో 'కథ.... కవిత'కార్యశాల శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయి బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు మాట్లాడుతూ యువత చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. బాలలు, విద్యార్థులు, అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని తెలిపారు. తమను నమ్ముకున్న తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.
-----------------------
Admin