Sunday, 26 July 2026 10:01:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలి... - డి.ఎస్.పి రెహమాన్

Date : 27 September 2023 09:22 AM Views : 327

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గణేష్ మండపాల కమిటీ మెంబర్స్ తో రామవరం లోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సమావేశం ఏర్పాటుకు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఉత్సవ కమిటీ వారే బాధ్యత వహించాలి . నిమజ్జన శోభాయాత్రను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కొత్తగూడెం డి.ఎస్.పి రెహమాన్ సూచించారు. టూ టౌన్ లో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో వినాయక మండపాల ఉత్సవ కమిటీ నిర్వాహకులకు పలు సూచనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలపై మ్యూజికల్ సిస్టమ్స్‌తో పాటు డీజేలు పెట్టడానికి ఎటువంటి అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా డీజే లను పెడితే అట్టి గణేష్ కమిటీ పై చట్టరీత్య చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలపై మద్యం మత్తులో ఉన్నవారిని అనుమతించకూడదు. రెచ్చగొట్టే నినాదాలు చేయడం, మత స్థలాల దగ్గర ఊరేగింపులను ఆపడంవంటివి చేయరాదన్నారు. ప్రతి విగ్రహం మధ్యాహ్నం 2 గంటల లోపు బయలుదేరాలని. చిన్నపిల్లలు, పెద్దవారిని నిమజ్జనం సమయంలో తీసుకొని వెళ్ళకూడదు. వాహనాలపై పరిమితికి మించి వెళ్ళకూడదు. ఊరేగింపు సమయంలో కరెంటు తీగలను గమనించి వాహనాన్ని నడపాలి. నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్లేటప్పుడు రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయకూదన్నారు. వాహనాలకు తగిన దారి ఉండేలా ఉత్సవ కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరేగింపులో పాల్గొనేవారు కర్రలు, కత్తులు,, మండే పదార్థాలు ఇతర ప్రమాదకరమైన వస్తువులు వంటి ఏ విధమైన ఆయుధాలను తీసుకెళ్లడం కూడా నిషేధించబడింది. ఊరేగింపులో భాగంగా ఎటువంటి గొడవలు కొట్లాటలు జరిగిన ఆ కమిటీ అందరూ భాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాటికి గణేష్ మండప ఆర్గనైజర్స్ భాధ్యత వహించి ఉండాల్సి ఉంటుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ రమేష్ కుమార్, ఎస్సై లు, ఏ సైలు టూ టౌన్ సిబ్బంది పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :