సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో ఆర్.ఎం.పి గ్రామీణ వైద్యులు తమ వైద్య సేవల పరిధి మరియూ ఆరోగ్య అంశాల పట్ల అవగాహన కలిగి సేవలు అందచేయాలని వైద్యాధికారి డాక్టర్ ఐ నుద్దీన్ ఖాన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నందు మండల వ్యాప్తంగా ఉన్న ఆర్.ఎం.పి ల కు నిర్వహించిన అవగాహన సదస్సు నందు పాల్గొంటూ ప్రసంగించారు. ఈ సందర్భము గా అయన మాట్లాడుతూ అన్ని ఆరోగ్య అంశాలపట్ల సునిశిత, ఖచ్చిత, పరిజ్ఞానం, నైపుణ్యత కలిగి ఉండి సేవలు అందచేసినప్పుడే నాణ్యమైన ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. అందరు ఆర్.ఎం.పి లు వారి వారి విద్య మరియూ ఇతర పరిధి నియమ నిబంధనలకు లోబడే అనగా ప్రథమ చికిత్స కు పరిమితమై ఆరోగ్య విద్య, రెఫరెల్ సేవలకు అధిక ప్రాధాన్యత యివ్వాలని సూచిస్తూ నిబంధనలను ఉల్లంఘించిన శాఖాపర కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమములో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాను ప్రకాష్ , కమ్యూనియ్ హెల్త్ ఆఫీసర్ శుభాషిణి, ఆర్.ఎం.పి లు పాల్గొన్నారు....
-----------------------
Admin