సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : లైయన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ టౌన్ ఆధ్వర్యంలో షాద్ నగర్ తాలుకా అధ్యక్షుడు ఎం. వెంకటరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారాన్ని అందజేశారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో రోగులకు లయన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ టౌన్ అధ్యక్షుడు లయన్ సందీప్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో 70 మంది రోగులకు ఉదయం అల్పాహారం విందు ఇచ్చారు. అదేవిధంగా షాద్ నగర్ బ్లాక్ ఆఫీస్ వాకర్స్ అసోసియేషన్ మరియు యోగా సెంటర్ ఆధ్వర్యంలో వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను జరిపారు. జన్మదినం సందర్భంగా సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాగుల రాజ్ కుమార్ బుచ్చయ్య మల్లేష్ గౌడ్ పొగాకు ప్రకాష్, లయన్స్ సందీప్, ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, ముత్యాలు యాదవ్, గంధం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin