సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి కలెక్టరేట్లో నీ స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు తిరిగి రీ ఓపెన్ కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో 219 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో,డిఆర్వో పి కొండయ్య, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్య రేఖవివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజా సమస్యల పరిష్కారంనికి శ్రీకారం చుట్టిందన్నారు. రీ ఓపెన్ క్యాటగిరిలో మళ్లీ అర్జీలు మళ్లీ రాకుండా నాణ్యమైన పరిష్కారం చూపించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్పందన గ్రీవెన్స్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని, సకాలంలో అర్జీలను పరిష్కరించాలన్నారు. అర్జీలను పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. తాడిమర్రి మండలం చిన్న చిగుళ్ల రేవు పంచాయితీ మర్రిమాకుల పల్లి వాసులు చత్రపతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా వాస్తవ విషయాలపై విచారణ జరిపి పదిహేను రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని ధర్మవరం ఆర్ డి ఓ ను ఆదేశించారు.
-----------------------
Admin