సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఏం. కే గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో గల సర్వే నెం. 1185, 1186, 1187, 1189, గల భూమి ఆర్మూర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పాడల్ మనోజ్ దగ్గర 14 మంది రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసారు, అప్పటి నుండి బాధితులు భూమి రిజెస్ట్రెషన్ చెయ్యమని అడగగా అప్పుడు ఇప్పుడు అని వారికీ చెప్పుతూ కాలయాపన చేస్తున్నాడని బాధితులు తెలిపారు. అయితే ఈనెల నవంబర్ 21 నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మినటువంటి వ్యక్తులు మార సూర్య నారాయణ,ప్రతాప్, ఆనంద్, సురేష్, వారు అట్టి సర్వే గల భూమి మాది అని, మా భూమి అమ్మమని కొందరు నాయకులు, అధికారులు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు మీడియా సమావేశం లో తెలపగ, అట్టి సమాచారం తెలియడం తో ఈ రోజు బాధితులు బాల్కొండ లో మీడియా సమావేశంలో బాధితులు చెప్పిన సమాచారం ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ వ్యాపారికి సుమారు 82 లక్షలు కట్టినామని అతను మాకు ఒప్పంద పత్రాలు రాసి ఇచ్చి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలేదని తెలిపారు. .మాకు ఎలాగైనా న్యాయం చెయ్యాలని ఈ సమావేశంలో కొరారు. ఈ వ్యవహారంలో నాయకుల ప్రమేయం లేదని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బాధితులు సల్లగారిగే ముకేశ్, గుజ్జెటి ధర్మపురి, గణేష్, షిండే పద్మశిలా, సింధు లక్ష్మి, సింధు శివ, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin