సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : నకిలీ స్టిక్కర్లు అతికించుకుని తిరిగితే అలాంటి వాహనాలు సీజ్ చేస్తాం. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈనెల 18 నుండి 25 వ తేదీ వరకు దీనిపై జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ -అనంతపురం ట్రాఫిక్ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి జిల్లాలో నకిలీ స్టిక్కర్లు అతికించుకుని తిరిగితే అలాంటి వాహనాలు సీజ్ చేస్తామని అనంతపురం ట్రాఫిక్ డీఎస్సీ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు ఈనెల 18 నుండి 25 వ తేదీ వరకు నకిలీ స్టిక్కర్లు అతికించుకు తిప్పి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఆయన స్థానిక ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. *ఇటీవల కాలంలో వాహనాల మీద నకిలీ స్టిక్కర్లను అతికించడం భలే ఫ్యాషన్ అయిపోయింది. టైకులు, కార్ల మీద ఇష్టమైన స్టిక్కర్లను అతికించుకుని రోడ్ల మీద షికారు చేస్తున్నారు. పోలీస్, ప్రెస్, అడ్వకేట్, డాక్టర్, ఆర్మీ, గవర్నమెంట్ అంటూ వివిధ రకాల స్టిక్కర్స్ అంటించుకొని తిరగడం మొదలుపెట్టారు. ఎవరు నిజమో, ఎవరు అబద్దమో తెలియక పోలీసులు. ఇబ్బందులు పడుతున్నారు. డూప్లికేట్ వాళ్లని పట్టుకోవడం కోసం జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి స్టిక్కర్ ఉన్నా అది ఒరిజినల్ కాదా అనే కోణంలో విచారించి నకిలీ అని తేలితే ఆ వాహనాన్ని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి.
-----------------------
Admin