Monday, 27 July 2026 09:39:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి - ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి

Date : 25 September 2022 02:08 AM Views : 557

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : హయత్ నగర్ డివిజన్ పరిధిలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎంఆర్ డిసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. 'మన బస్తీ - మన బడి' కార్యక్రమంలో భాగంగా శనివారం హయత్నగర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో రూ.48 లక్షల 47 వేల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డితో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శంకుస్థాపన చేశారు. పాఠశాలలో ప్రహారీ, నిర్మాణం, మూత్రశాలలు, ఫర్నీచర్ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. హయతనగర్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి కృషిచేస్తానని హామీనిచ్చారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, నాయకులు భాస్కర్ సాగర్, సింగిరెడ్డి మల్లీశ్వరి, దర్శన్ గౌడ్, శ్రావణ్, భిక్షపతి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :