సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా సర్కార్ టీవీ ప్రతినిధి ప్రవీణ్ : కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాచర్ల మహేష్ చంద్ర మాట్లాడుతూ ఆధునిక భారత చరిత్రలో కీలక వ్యక్తి అయిన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ జయంతిని గుర్తుచేసుకుంటూ ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. భారత రాజ్యాంగ పితామహుడిగా కూడా పిలువబడే డాక్టర్ అంబేద్కర్ ఒక న్యాయవాది, ఆర్థికవేత్త,సామాజిక సంస్కర్త. భారతదేశ కుల వ్యవస్థ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు, అణగారిన వర్గాలు,ముఖ్యంగా దళితులు,ప్రధాన స్రవంతిలో పాల్గొనేలా చేశారు.ఈ దినోత్సవం డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని,సామాజిక న్యాయం, సమానత్వం,మానవ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని జరుపుకుంటారు అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత రత్న అవార్డు గ్రహీత చిలక. రవీందర్, పొడి శెట్టి ప్రభుదాస్,పూర్ణ చందర్, మాతంగి.సునీల్,మాచర్ల.విల్సన్, మాతంగి. ప్రశాంత్,సందీప్,మాతంగి.మహిపాల్, కట్కూర్ క్రిస్టఫర్, మాచర్ల.కర్ణాకర్,మాతంగి.సురేష్, బిజీ గిరి ,కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin