సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మరికల్ మండలం, చిత్తనూరు శివారులో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని గత సంవత్సరానికి పైగా పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పలు రూపాల్లో ఉద్యమిస్తున్న పట్టించుకోకుండా కంపెనీ యజమాని వైపు ప్రజా ప్రతినిధులు, అధికారులు నిలబడడం శోచనీయం. ఓట్లు వేసిన ప్రజల వైపు పాలకులు ఉండకుండా ప్రజలకు వ్యతిరేకంగా ఒకరిద్దరూ బడా బాబుల వైపు నిలబడటం దారుణం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటారు కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాపారవేత్తలే ప్రభువులు అయినట్లు వారికి కనబడుతున్నారు. ఈ క్రమంలో ఇథనాల్ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలని ఇప్పటికే పలు రూపాల్లో ఉద్యమాలు జరిగినప్పటికీ మరింత విస్తృతంగా ప్రజల్లోకి కంపెనీ యొక్క కష్టనష్టాలను ప్రజలకు తెలియజేయడానికి ఈనెల 11వ తేదీన పాదయాత్రను చిత్తనూరు లో మొదలైన ఈరోజు సీతారాంపేటలో 8వ రోజు మొదలైన పాదయాత్ర నెల్లికొండి చిన్న వడ్డెమాన్ వడ్డేమాన్ ఏదిలాపురం చిన్నచింతకుంట మండలం మద్దూర్ కి ఈరోజు చేరుకుంటుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల వైపు నిలబడి ఇథనాల్ కంపెనీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో భవిష్యత్తులో జరిగే తీవ్రతరమైన పోరాటాలకు పాలకులే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. ఈ క్రమంలో ఈ నెల 21 తారీకున ఆత్మకూరులో పాద్రాయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ పాదయాత్ర లో పాల్గొన్న చిత్తూనూరు, కన్మనూరు, రాంపూర్ గ్రామాల రైతులు, మహిళలు ఇంకా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి అఖిల భారత కన్వీనర్ బండారు లక్ష్మయ్య ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.చక్రవర్తి , రాష్ట్ర నాయకులు ఈరపాగ గోవిందు, కులనిర్మూలన పోరాట సమితి కార్యవర్గ సభ్యులు బండారి నర్సప్ప, రమేష్ ,మహదేవ్, టి ఎఫ్ టు యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్, యాదగిరి, బి ఎస్ పి పార్టీ దేవరకద్ర నియోజకవర్గం ఇంచార్జి సంతోష్ రెడ్డి , నియోజకవర్గ అధ్యక్షులు విజయకుమార్ , చిన్న చింతకుంట అధ్యక్షులు రవీందర్ పాదయాత్ర లో పాల్గొన్నారు.
-----------------------
Admin