Sunday, 26 July 2026 03:47:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హెచ్ఐవీ వచ్చిందని దేవుడిపై పగ...

Date : 31 August 2025 12:20 PM Views : 501

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : అతడికి హెచ్ఐవీ సోకింది. అది తగ్గాలని దేవుడిని నిత్యం ప్రార్ధించాడు. అయినా అది ఎంతకూ తగ్గలేదు. అయితే తనకు ఆ రోగం రావడానికి దేవుడే కారణమని నమ్మాడు. దేవుడిపై కోపంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో వింత దొంగతనాలు చేసే ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పన్నెండేళ్లుగా ఇతను దేవాలయాల్లోని విరాళాల పెట్టెల్లో డబ్బును మాత్రమే దొంగిలిస్తూ, విలువైన ఇతర వస్తువులను తాకకుండా అదృశ్యమయ్యేవాడు. ఈ దొంగతనాలను దేవుడిపై ప్రతీకారంగా చేసినట్లు తెలుస్తోంది. దుర్గ్ శివార్లలోని ఓ జైన దేవాలయంలో చోరీ తర్వాత 45 ఏళ్ల యశ్వంత్ ఉపాధ్యాయను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో యశ్వంత్ తన నేరాలకు గల కారణాన్ని వివరించాడు. దీంతో అంతా అవాక్కయ్యాడు.2012లో ఓ దాడి కేసులో జైలు శిక్ష అనుభవించినప్పుడు తాను హెచ్ఐవి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఉపాధ్యాయ చెప్పాడు. తన తప్పు లేకుండా ఈ వ్యాధి సోకిందని, దీనివల్ల తన జీవితం ఘోరంగా నాశనం అయిందని వాపోమయాడు. ఈ వ్యాధి తనకు రావడానికి దేవుడే కారణమని నమ్మాడు. తాను హెచ్ఐవి నుంచి కోలుకోవాలని నిరంతరం దేవుడిని ప్రార్థించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో దేవుడిపై కోపం పెంచుకున్నాడు. తన కోపాన్ని వెళ్లగక్కడానికి దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని, హుండీల్లోని పెట్టెల్లోని డబ్బును దొంగిలించడం ప్రారంభించాడు. యశ్వంత్ చాలా తెలివిగా దొంగతనాలు చేసేవాడు. దొంగతనం చేసే ముందు ఆలయాన్ని పరిశీలించేవాడు. కేవలం తన స్కూటర్‌పైనే ప్రయాణించేవాడు, దొంగతనానికి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు బట్టలు మార్చుకునేవాడు. సిసిటివి కెమెరాలకు చిక్కకుండా ఉండటానికి ప్రధాన రహదారులకు బదులుగా ఇరుకైన సందుల్లో ప్రయాణించేవాడు. ఆలయంలోని హుండీలు పగలగొట్టి, నగదు మాత్రమే తీసుకొని, మళ్లీ ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటికి వెళ్లిపోయేవాడు.ఇటీవల దుర్గ్ శివార్లలోని ఓ జైన ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు. యాంటీ-క్రైమ్, సైబర్ యూనిట్ బృందం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడం ద్వారా అతడిని గుర్తించి అరెస్ట్ చేసింది. విచారణలో యశ్వంత్ తాను దాదాపు పన్నెండు దేవాలయాల్లో దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. అయితే వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :