సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : 93 బీసీ కులాలను ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాడి, వారి అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి , హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ జన్మదినం సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండవ వేంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాప కింద నీరులా బలపడుతుందని ,తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా భగవంతుని ఆశీర్వాదం కాసాని జ్ఞానేశ్వర్ పై ఉండాలని, జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో త్వరలో జరిగే బస్సు యాత్ర విజయవంతం అయ్యేవిధంగా భగవంతుడు శక్తి సామర్థ్యాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ పార్టీ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కొమ్మగానీ వెంకటేశ్వర్లు గౌడ్, మీసాల సైదులు ,బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చల్లా వంశి , హుజూర్నగర్ పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు చంద్రగిరి సాంబ, టిఎన్టియుసి నాయకులు నాగవెల్లి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin