సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడే పల్లి మండలంలోని వెలిదండ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జనార్దన్ రెండో వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ జనార్దన్ (జన్ను ) అకాల మరణం పార్టీకి ప్రజాసంఘాలకు తీరనిలోటని ఆయన అన్నారు ప్రజా ఉద్యమాలలో అనేక ఆటుపోటులను నిర్బంధాలను అక్రమ అరెస్టులను తట్టుకోని తను నమ్మిన సిద్ధాంతాన్ని కడవరకు ఆచరించాడని ఆయన అన్నారు కష్టాల బాటలో కష్టజీవులకు అండగా నిలిచిన ఆదర్శ విప్లవ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ జనార్ధన్ అని అన్నారు గోదావరి లోయ ప్రతిఘటన పోరాట బాటలో సీపీ రెడ్డి పోరు దారిలో నడిసిన నిర్మాణాత్మక పోరాట యోధుడని ఆయన అన్నారు ఆయన ఆశయాల కోసం మనమందరం కంకణ బదులం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామల్ల నవీన్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వల్లభిదాసు రాజు భువన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కామల్ల శ్రీను అరుణోదయ జిల్లా నాయకులు గండు నాగేశ్వరరావు ,కామల్ల వెంకటి ,చింతమల్ల అంజయ్య ,బెల్లంకొండ రవి, మండల వీరబాబు ,దుగ్గి తిరపయ్య , నాగేష్ ,జిహెచ్ లక్ష్మయ్య ,సిహెచ్ సైదులు, రాంబాబు, గోపి, లింగయ్య, పిల్లుట్ల రాములు ,పెంటయ్య, సైదమ్మ ,సువార్త తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin