సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించిందని ఇందులో భాగంగా ప్రజల కష్టాలను తీర్చేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని.. ఎన్ని కష్టాలైనా అనుభవిస్తానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. షాద్ నగర్ నియోజక వర్గం ఫరూఖ్ నగర్ మండలం నాగర్ల గడ్డ తాండలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ తన సొంత ఖర్చులతో సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయలతో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు రెండు పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారని రెండు పర్యాయాలు వాళ్లు నియోజకవర్గాన్ని పాలించారని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని వీర్లపల్లి శంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ఆవిష్కృతం చేశామని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని దీనికి ప్రజల ఆశీస్సులు సంపూర్ణంగా కావాలని అన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలు అమలు ఐతే రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉండటారని అన్నారు. మహిళలకు చిన్న కష్టం కూడా రానివ్వమని అన్నారు. రైతులకు యువతకు విద్యార్థులకు అన్ని వర్గాలకు పెద్దపీట వేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దర్శన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, ఎస్టీ సెల్ తాలూకా అధ్యక్షుడు శీను నాయక్, కంసాన్ పల్లి మాజీ ఎంపీటీసీ తుపాకుల శేఖర్ ముదిరాజ్, రవి నాయక్, కే సత్తిరెడ్డి, ఎం డి వహాబ్, ఏ బాలరాజు, ఎండి మున్నా, విలేజ్ ప్రెసిడెంట్ మల్లేష్, జగన్ నాయక్, లడ్డు, తండా మహిళలు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin