సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : రాష్ట్రంలో గిరిజనులు రిజర్వేషన్లు 10 శాతం పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించ డం పై హర్షం.... సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం, సూరయ్య బంజార తండా గ్రామంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో గిరిజనుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లు శాతం పెంచడం, వారం రోజుల్లోనే జీవోను విడుదల చేసే విధంగా కసరత్తు చేయడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. గూడేలను , తండాలను గ్రామపంచాయతీలుగా చేయాలని, మా యొక్క గ్రామాన్ని, మేమే పాలిస్తామని, స్వయం పాలన కావాలని చెప్పి, ఎన్నో సంవత్సరాలుగా నినాదించిన ఆదివాసి, లంబాడి సోదరులకు ఒక ప్రత్యేకమైన స్థానం ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. సూరయ్య బంజరగ్రామంలో నూతనంగా లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేయగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారికి ముందుగా గ్రామ ప్రజలు గ్రామ శివారు నుండి మేల తాళాలతో పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని గిరిజనులు అంతా కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పూలు పాలభిషేకాలు నిర్వహించి, అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గ్రామంలో మంజూరు అయిన నూతన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను, కల్యాణలష్మి , షాదీ ముబారక్ చెక్కులను, చెక్కులతో పాటు పెళ్లి కానుకగా సొంత ఖర్చులతో చీరను బహుకరణగా అందజేసి, తమ సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధులను మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు... ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పం చ్.ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin