Monday, 27 July 2026 08:47:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం...

Date : 05 September 2023 08:21 AM Views : 418

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి అన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమంలో భాగంగా లక్ష్మిదేవిపల్లిలోని ప్రశాంత్ నగర్ పంచాయతీలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు గత ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు 12 లక్షల రూపాయల దళిత బంధు, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్ బండ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రెండు లక్షల ఉద్యోగాలను తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు భావ్ సింగ్,ఉప్పల హేమంత్,మల్లేష్, సీతయ్య, సుందర్ లాల్ కోరి, కనకరాజు, చిమట నాగేశ్వరావు, మైనార్టీ నాయకులు గౌస్, అయూబ్ ఖాన్, నరేష్, సత్యనారాయణ రెడ్డి, కుమార్, ఉదయ్ కుమార్, శేఖర్, దుర్గరాశి సతీష్, సంపత్,మహేష్, మహిళా నాయకురాళ్ళు పుష్ప, లైలా, సరిత, సరోజినీ, నాగమ్మ , మహిళా కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :