సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఇంజనీరింగ్, డిప్లొమా నందు 2023-24 విద్యా సంవత్సరం లో అడ్మిషన్లు పొందిన విద్యార్థినీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'ప్రగతి స్కాలర్ షిప్' లకు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభావంతులైన బాలికల కొరకు ఉన్నత సాంకేతిక విధ్యను ప్రోత్సహించేందుకు గాను 'అఖిల భారత సాంకేతిక విధ్యా మండలి' వారు ఇంజనీరింగ్, డిప్లొమాలో మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకున్న వారికి సంవత్సరానికి 50,000 చొప్పున 3సంవత్సరాలకు1లక్ష50 వేల రూపాయలను,ఇంజనీరింగ్ వారికి 4 సంవత్సరాలకు 2లక్షల చొప్పున ఆయా విద్యార్ధినీల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చెయ్యటం జరుగుతుందని. ఈ స్కాలర్ షిప్ లు పొందటానికి సంవత్సర ఆదాయం 8లక్షల లోపు కలిగిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, 10వ తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు, సంబంధిత కళాశాలలో చదువుతున్నట్లు అడ్మిషన్ నెంబర్, స్టడీ సర్టిఫికెటు, ట్యూషన్ ఫీజు స్వీకరణ పత్రం,ఆధార్ నెంబర్తో అనుసంధానమైన సదరు విద్యార్థినీ యొక్క బ్యాంకు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు నకలు తీసుకొని scholarships.gov.in, National Scholarships Portal వెబ్సైటు నందు డిసెంబర్ 31వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ , ప్రైవేటు ఇంజనీరింగ్ , డిప్లొమా కళాశాలల్లో చదువుకునే అన్ని వర్గాలకు చెందిన విద్యార్థినీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష్యంతో ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేసుకోవాలి యాకూబ్ పాషా కోరారు. ఇతర సమాచారం కోసం 8520860785 ఫోన్ నంబర్ కు సంప్రదించాలని తెలిపారు.
-----------------------
Admin