Sunday, 26 July 2026 04:48:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

'ప్రగతి స్కాలర్ షిప్' కు దరఖాస్తు చేసుకోండి... - జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా

Date : 11 October 2023 09:58 AM Views : 311

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఇంజనీరింగ్, డిప్లొమా నందు 2023-24 విద్యా సంవత్సరం లో అడ్మిషన్లు పొందిన విద్యార్థినీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'ప్రగతి స్కాలర్ షిప్' లకు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభావంతులైన బాలికల కొరకు ఉన్నత సాంకేతిక విధ్యను ప్రోత్సహించేందుకు గాను 'అఖిల భారత సాంకేతిక విధ్యా మండలి' వారు ఇంజనీరింగ్, డిప్లొమాలో మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకున్న వారికి సంవత్సరానికి 50,000 చొప్పున 3సంవత్సరాలకు1లక్ష50 వేల రూపాయలను,ఇంజనీరింగ్ వారికి 4 సంవత్సరాలకు 2లక్షల చొప్పున ఆయా విద్యార్ధినీల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చెయ్యటం జరుగుతుందని. ఈ స్కాలర్ షిప్ లు పొందటానికి సంవత్సర ఆదాయం 8లక్షల లోపు కలిగిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, 10వ తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు, సంబంధిత కళాశాలలో చదువుతున్నట్లు అడ్మిషన్ నెంబర్, స్టడీ సర్టిఫికెటు, ట్యూషన్ ఫీజు స్వీకరణ పత్రం,ఆధార్ నెంబర్తో అనుసంధానమైన సదరు విద్యార్థినీ యొక్క బ్యాంకు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు నకలు తీసుకొని scholarships.gov.in, National Scholarships Portal వెబ్సైటు నందు డిసెంబర్ 31వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ , ప్రైవేటు ఇంజనీరింగ్ , డిప్లొమా కళాశాలల్లో చదువుకునే అన్ని వర్గాలకు చెందిన విద్యార్థినీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష్యంతో ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేసుకోవాలి యాకూబ్ పాషా కోరారు. ఇతర సమాచారం కోసం 8520860785 ఫోన్ నంబర్ కు సంప్రదించాలని తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :